‘గుంటూరు ప్రజలకు లేని బాధ బీజేపీకి ఎందుకు?’
ABN , First Publish Date - 2022-01-04T23:18:44+05:30 IST
తెలుగురాష్ట్రాల్లో బీజేపీ డ్రామాలాడుతోందని టీడీపీ నేత నక్కా ఆనందబాబు మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్తో కలిసి కాంగ్రెస్ను చంపాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
గుంటూరు: తెలుగురాష్ట్రాల్లో బీజేపీ డ్రామాలాడుతోందని టీడీపీ నేత నక్కా ఆనందబాబు మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్తో కలిసి కాంగ్రెస్ను చంపాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అలాగే ఏపీలో జగన్తో కలిసి టీడీపీని చంపాలని కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క శాతం ఓట్లు కూడా లేని బీజేపీ కొత్త నాటకాలు వేస్తోందన్నారు. ఎప్పుడో కట్టిన జిన్నా టవర్పై ఇప్పుడు బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు. గుంటూరు ప్రజలకు లేని బాధ బీజేపీకి ఎందుకో చెప్పాలి? అని డిమాండ్ చేశారు.