ప్రజల నడ్డి విరుస్తున్న జగన్: నక్కా ఆనంద బాబు
ABN , First Publish Date - 2022-04-17T02:34:17+05:30 IST
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను వరుస పెట్టి ధరలతో బాదుతున్నాడని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు అన్నారు.
గుంటూరు: జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను వరుస పెట్టి ధరలతో బాదుతున్నాడని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు అన్నారు. శనివారం భట్టిప్రోలు మండలం పెదపులివర్రు గ్రామంలో ఆనంద బాబు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కరెంట్, ఆర్టీసీ బస్ చార్జీలు పెంపు, కరెంట్ కోతలకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోజురోజుకు జగన్మోహన్ రెడ్డి విద్యుత్, నిత్యావసర, ఆర్టీసీ చార్జీలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు.జగన్ మూడేళ్ల పాలనలో వరస పెట్టి ప్రజలను బాదేస్తున్నాడని చెప్పారు. నిత్యవసర, విద్యుత్, ఆర్టీసీ చార్జీలతో ప్రజల నడ్డి విరుస్తున్నాడన్నారు.పాదయాత్రలో జగన్ పెట్టిన ముద్దులు, ఇప్పడు గుద్దులుగా తగులుతున్నాయని ఎద్దేవా చేశారు.జగన్ పాలనలో పేదల బ్రతుకు చిద్రమైందన్నారు. మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన జగన్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని నక్కా ఆనంద బాబు వ్యాఖ్యానించారు.