బీహార్ సీఎం నితీశ్ సభలో పేలుడు కలకలం

ABN , First Publish Date - 2022-04-12T22:38:04+05:30 IST

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నలందలో నిర్వహిస్తున్న జనసభలో పేలుడు కలకలం సృష్టించింది.

బీహార్ సీఎం నితీశ్ సభలో పేలుడు కలకలం

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నలందలో నిర్వహిస్తున్న జనసభలో పేలుడు కలకలం సృష్టించింది. వేదికకు అతి సమీపంలో ఘటన జరగడంతో జనం పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. పేలుడు ఘటనకు సంబంధించి ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి అది బాంబు దాడి కాదని బాణాసంచా అని పోలీసులు తేల్చారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 


నితీశ్‌పై రెండు వారాల క్రితం భక్తియార్‌పూర్‌లో ఓ యువకుడు దాడి చేశాడు. అతడి మానసిక పరిస్థితి బాగలేదని ఆ తర్వాత వదిలిపెట్టారు. 



Updated Date - 2022-04-12T22:38:04+05:30 IST