Rahul Gandhi సభకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి దూరం
ABN , First Publish Date - 2022-05-06T17:48:46+05:30 IST
వరంగల్లో జరగనున్న రాహుల్ సభకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉంటున్నారు.
Nalgonda: వరంగల్లో జరగనున్న రాహుల్ గాంధీ సభకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉంటున్నారు. ఆరోగ్య సమస్యలతో రాహుల్ రైతు సంఘర్షణ సభకు గైర్హాజరవుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం హైదరాబాదులోనే ఉన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. వరంగల్ రాహుల్ సభకు సైతం డుమ్మా కొట్టడంతో జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది.