దళితుడిని చితకబాదిన కేసులో పోలీసులపై సస్పెన్షన్ వేటు
ABN , First Publish Date - 2021-12-08T18:17:09+05:30 IST
ఓ దళితుడిని చితకబాది గాయపర్చిన కేసులో ఎస్ఐ, కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు పడింది.
నల్గొండ జిల్లా: ఓ దళితుడిని చితకబాది గాయపర్చిన కేసులో నల్గొండ జిల్లా టూ టౌన్ ఎస్ఐ నర్శింహులు, కానిస్టేబుల్ నాగుల్ మీరాపై సస్పెన్షన్ వేటు పడింది. రవీంద్ర నాయక్ కాలనీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రొయ్యల శ్రీనును గాయపర్చిన ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణ జరిపి ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.