granted parole: నళినికి ఏడోసారి పెరోల్ మంజూరు
ABN , First Publish Date - 2022-07-27T16:02:30+05:30 IST
మాజీ ప్రధాని రాజీవ్గాంధీ(Rajiv Gandhi) హత్య కేసు ముద్దాయి నళినికి రాష్ట్ర ప్రభుత్వం ఏడోసారి పెరోలు మంజూరు(Sanction) చేసింది. వేలూరు మహిళా జైలులో 30 యేళ్లకు
చెన్నై, జూలై 26 (ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని రాజీవ్గాంధీ(Rajiv Gandhi) హత్య కేసు ముద్దాయి నళినికి రాష్ట్ర ప్రభుత్వం ఏడోసారి పెరోలు మంజూరు(Sanction) చేసింది. వేలూరు మహిళా జైలులో 30 యేళ్లకు పైగా యావజ్జీవకారాగార శిక్ష అనుభవిస్తున్న నళినికి గతేడాది డిసెంబర్ 27న తొలిసారిగా పెరోలు మంజూరైంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నళిని(Nalini) తల్లి పద్మావతి తన కుమార్తెకు పెరోలు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.