తెలంగాణ-ఏపీ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఆంక్షలు

ABN , First Publish Date - 2021-05-11T15:01:04+05:30 IST

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో తెలంగాణ పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి.

తెలంగాణ-ఏపీ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఆంక్షలు

నల్లగొండ: తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో తెలంగాణ పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మధ్యాహ్నం 12 గంటల నుండి ఉదయం 6 వరకు ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నెల 18 వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దులైన సూర్యాపేట జిల్లా రామాపురం(కోదాడ), నల్లగొండ జిల్లా పొందుగుల(వాడపల్లి), నాగార్జునసాగర్(మాచర్ల వైపు) మూడు చెక్ పోస్టుల వద్ద తెలంగాణ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులను తెలంగాణలోకి అనుమతించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. తెలంగాణలోని ఆసుపత్రుల్లో రెఫరెన్స్ లెటర్, బెడ్ కన్ఫర్మ్ ఉంటేనే కోవిడ్ పేషేంట్స్‌లకు తెలంగాణలోకి అనుమతి ఇస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే విధుల్లో ఉన్నామని పోలీసులు  చెబుతున్నారు.

Updated Date - 2021-05-11T15:01:04+05:30 IST