ఎమ్మెల్యే భాస్కర్రావుపై హెచ్ఆర్సీకి మహిళ ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-09-26T18:24:46+05:30 IST
మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుపై ఓ మహిళ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసింది.
నల్లగొండ: మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుపై ఓ మహిళ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసింది. భూకబ్జాలకు అడ్డుకున్నందుకు తమ కుటుంబ సభ్యులపై కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ పట్టణానికి చెందిన బంటు మణెమ్మ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే, పోలీసుల నుంచి తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవలే న్యాయవాది ముసుగులో భూకబ్జాలకు పాల్పడుతున్నారని మణెమ్మ భర్త బంటు బుచ్చిబాబుపై ఎస్పీ రంగనాథ్ పీడీ యాక్ట్ నమోదు చేసిన విషయం తెలిసిందే.