నల్లగొండలో BJP, TRS నేతలపై 15 కేసులు

ABN , First Publish Date - 2021-11-17T17:03:09+05:30 IST

ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీల నాయకులపై 15 కేసులు నమోదు అయ్యాయి.

నల్లగొండలో BJP, TRS నేతలపై 15 కేసులు

నల్లగొండ: ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీల నాయకులపై 15 కేసులు నమోదు అయ్యాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన, శాంతి భద్రతలకు విఘాతం, రైతులు, పోలీసులపై దాడుల చేయడంపై కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో ఇరుపార్టీ నాయకులపై నల్గొండ రూరల్, మిర్యాలగూడ వన్ టౌన్, మాడ్గుల పల్లి, వేముల పల్లి పోలీస్ స్టేషన్లలో పోలీసులు పది కేసులు నమోదు చేశారు. ఈ పర్యటనలో ముగ్గురు రైతులు, ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయని డీఐజీ ఏవీ రంగనాథ్ తెలిపారు. సూర్యాపేట జిల్లాలో బండి సంజయ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఎన్నికల కోడ్, శాంతిభద్రతల ఉల్లంఘనలపై ఐదు కేసులు నమోదు అయ్యాయి. సూర్యాపేట టౌన్, రూరల్, చివ్వేంల, పెన్ పహాడ్, ఆత్మకూర్ (ఎస్)పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. 

Updated Date - 2021-11-17T17:03:09+05:30 IST