TS News: మృతశిశువును లాక్కెళ్లిన కుక్కలు, పందులు

ABN , First Publish Date - 2022-10-02T13:25:32+05:30 IST

జిల్లా కేంద్ర ఆసుపత్రిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం ఆవరణలో మృత శిశువును కుక్కలు, పందులు లాక్కెళ్లాయి.

TS News: మృతశిశువును లాక్కెళ్లిన కుక్కలు, పందులు

నల్గొండ : జిల్లా కేంద్ర ఆసుపత్రిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం (Mata Child Care Centre) ఆవరణలో మృత శిశువును కుక్కలు, పందులు లాక్కెళ్లాయి. హ్యుమన్ రైట్స్ కమీషన్ చైర్మన్ (Chairman of the Human Rights Commission) వచ్చిన రోజే ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు 34 వారాల వయసున్న ఆడ శిశువుగా గుర్తించారు. ఆసుపత్రిలో ఉన్న రోగులు, సిబ్బంది అడ్డుకున్నప్పటికే మృత శిశువు ఎడమ చెయ్యిని కుక్కలు పూర్తిగా తినేశాయి. ఆసుపత్రిలో మృతి చెందాక అక్కడ పడేశారా.... లేక బయట నుంచి కుక్కలు తెచ్చాయా అన్న కోణంలో విచారణ జరుగుతోంది. ఈ ఘటనపై ప్రజా సంఘాలు, రోగులు మండిపడుతున్నారు. 

Updated Date - 2022-10-02T13:25:32+05:30 IST