Nallagonda: కోదాడ-మిర్యాలగూడ రహదారిపై రైతుల రాస్తారోకో
ABN , First Publish Date - 2021-11-02T13:45:44+05:30 IST
జిల్లాలోని నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ ఎదురుగా కోదాడ-మిర్యాలగూడ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు.
నల్లగొండ: జిల్లాలోని నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ ఎదురుగా కోదాడ-మిర్యాలగూడ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. నేరేడుచర్లలోని మిల్లులు తెరిచి ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు. రైతుల ధర్నాతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నిన్నటి నుంచి ధాన్యం ట్రాక్టర్లను మిర్యాలగూడ వైపుకు పోలీసులు అనుమతించని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.