ప్రజలు తలదించుకునేలా బండి సంజయ్ వ్యాఖ్యలు: నామా

ABN , First Publish Date - 2020-11-27T01:30:45+05:30 IST

ప్రజలు తలదించుకునేలా బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయని నామా నాగేశ్వరరావు అన్నారు. ఇప్పటివరకు పార్లమెంట్‌లో తెలంగాణ గురించి మాట్లాడలేదు..

ప్రజలు తలదించుకునేలా బండి సంజయ్ వ్యాఖ్యలు: నామా

హైదరాబాద్ : ప్రజలు తలదించుకునేలా బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయని నామా నాగేశ్వరరావు అన్నారు. ఇప్పటివరకు పార్లమెంట్‌లో తెలంగాణ గురించి మాట్లాడలేదు.. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ నిధులపై బీజేపీ ఎంపీలు కేంద్రాన్ని అడగలేదు కాని ఓట్లప్పుడు మాత్రం గుంపులు గుంపులుగా వచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. నిధులు తేలేని బీజేపీ నేతలకు ఓట్లు ఎందుకు వేయాలని నామా నిలదీశారు. బీజేపీ చెప్పే మాయ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరని, గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు. టీఆర్ఎస్ పాలనలో సిటీ ఎంతో అభివృద్ధి చెందిందని నామా అన్నారు. 

Updated Date - 2020-11-27T01:30:45+05:30 IST