ఆంజనేయస్వామి సేవలో ముస్లిం నేత

ABN , First Publish Date - 2020-09-23T16:35:17+05:30 IST

నామక్కల్‌లో ప్రసిద్ధిచెందిన ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి మతసామరస్యం చాటే విధంగా జమాత్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం పూజల్లో పాల్గొన్నారు. కేంద్రప్రభుత్వం కొత్తగా ప్రకటించిన

ఆంజనేయస్వామి సేవలో ముస్లిం నేత

చెన్నై : నామక్కల్‌లో ప్రసిద్ధిచెందిన ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి మతసామరస్యం చాటే విధంగా జమాత్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం పూజల్లో పాల్గొన్నారు. కేంద్రప్రభుత్వం కొత్తగా ప్రకటించిన నూతన విద్యా విధానం, వ్యవసాయ బిల్లులు తదితర పథకాలకు వ్యతిరేకంగా డీఎంకే, మిత్రపక్షాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా నామక్కల్‌ జిల్లా బీజేపీ తరఫున మంగళవారం నామక్కల్‌ ఫ్లవర్‌ బజార్‌ రోడ్డులో ధర్నా నిర్వహించారు. ఇందులో బీజేపీకి తమిళనాడు ఏక్తాజమాత్‌ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం పాల్గొన్నారు. ధర్నా అనంతరం ఆయన నామక్కల్‌ నరసింహస్వామి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. అలాగే హనుమంతుడి సేవలో పాల్గొన్నారు. అదే ఆలయ ప్రాంగణంలో ఉన్న లక్ష్మీనారాయణ స్వామి సన్నిధి, తాయారు సన్నిధిలకు తీసుకెళ్లి ఆశీర్వదించారు.

Updated Date - 2020-09-23T16:35:17+05:30 IST