నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అలయ్-బలయ్.. హాజరుకానున్న చిరు..
ABN , First Publish Date - 2022-10-06T14:46:35+05:30 IST
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (Nampally Exbition Grounds) నేడు 11గంటలకు అలయ్ బలయ్ కార్యక్రమం జరగనుంది.
Hyderabad : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (Nampally Exbition Grounds) నేడు 11గంటలకు అలయ్ బలయ్ కార్యక్రమం జరగనుంది. ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళసై హాజరు కానున్నారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సహా.. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ వంటలు రుచి చూపించనున్నారు. బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమం జరుగుతోంది. 2005లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని గవర్నర్ బండారు దత్తాత్రేయ మెదలుపెట్టారు.