తెలుగుదేశం కువైత్‌ ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2021-01-25T17:51:59+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమెల్సీ నారా లోకేష్ జన్మదిన వేడుకలను తెలుగుదేశం కువైట్ అధ్యక్షుడు

తెలుగుదేశం కువైత్‌ ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

కువైత్: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమెల్సీ నారా లోకేష్ జన్మదిన వేడుకలను తెలుగుదేశం కువైట్ అధ్యక్షుడు శ్రీ కుదరవల్లి సుధాకర రావు అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యవర్గ సభ్యులందరూ కలిసి కేక్ కట్ చేసి నారా లోకేష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్బంగా సుధాకర రావు మాట్లాడుతూ.. లోకేష్ దేశంలోనే మంచి రాజకీయ నాయకుడన్నారు. ప్రజాసేవలో తాత ఎన్టీఆర్‌ను, తండ్రి చంద్రబాబు నాయుడును, మామ నందమూరి బాలకృష్ణను మించిపొతున్నారన్నారు. పీఆర్వో ఈశ్వర్ నాయుడు మాట్లాడుతూ.. లోకేష్ పంచాయతీ రాజ్, ఐటీ శాఖకు మంత్రిగా ఉన్నప్పుడు పల్లెల్లో వేయించిన సిమెంటు రోడ్లు, ఎల్.ఈ.డీ లైట్లు తప్ప ఇప్పటి ప్రభత్వం చేసిందేమి లేదన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో మంత్రులు బూతులు తిట్టటానికే సమయాన్ని కేటాయిస్తున్నారని మండిపడ్డారు. బూతులు తిట్టడం తప్ప అభివృద్ది అనేదాన్ని మర్చిపోయారన్నారు. కాగా.. నారా లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో ఏనుగొండ నరసిమ్హులు, ఈడుపుగంటి ప్రసాద్, బోయపాటి శ్రీను, విజయ కూమర్, గంటా గోపి, వంశీ, నరేష్, మంచూరి శివ, గూదె శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-25T17:51:59+05:30 IST