గ్రామీణాభివృద్ధికి లోకేష్ కృషి ఎనలేనిది!
ABN , First Publish Date - 2022-01-24T02:57:37+05:30 IST
రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ మాజీ మంత్రి నారా లోకేష్బాబు ఎంతో కృషి చేశారని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్కుమార్ అన్నారు.
గూడూరు, జనవరి 23: రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ మాజీ మంత్రి నారా లోకేష్బాబు ఎంతో కృషి చేశారని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్కుమార్ అన్నారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో పట్టణ తెలుగుయువత, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ మంత్రిగా లోకేష్బాబు ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, ఎల్ఈడీ బల్బులు, నీళ్ల ట్యాంకులు నిర్మించి అభివృద్ధికి పాటుపడ్డారన్నారు. కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి అండగా నిలిచారన్నారు. మంత్రి కొడాలి నానికి టీడీపీని విమర్శించే అర్హతలేదన్నారు. గుడివాడలో జరిగిన సంఘటనలను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పిన ఆయన, ఈరోజు అన్ని పార్టీలు అక్కడ జరిగిన సంఘటనలను వీడియోలతో సహా నిరూపించినా, రాజకీయం నుంచి తప్పుకోకపోవడం మాట తప్పడమేనన్నారు. ఉద్యోగులు చేస్తున్న న్యాయమైన పోరాటాలకు టీడీపీ మద్దతుగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో నెలబల్లి భాస్కర్రెడ్డి, బిల్లు చెంచురామయ్య, అబ్దుల్ రహీం, చంద్రమౌళి, మట్టం శ్రావణి, గుండాల లీలావతి, బత్తిన ప్రణీత్యాదవ్, వెంకటేష్, మువ్వా చరణ్, సాయి, గవస్కర్రెడ్డి, సురేంద్ర, పెంచలయ్య, కృష్ణయ్య, సునీల్, శ్రీనివాసులు, మోహన్, శివప్రసాద్, సద్దాం తదితరులు పాల్గొన్నారు.
చిట్టమూరు: తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహన కార్యదర్శి కామిరెడ్డి సునీల్రెడ్డి ఆధ్వర్యంలో మల్లాంలో వేడుకలు నిర్వహించారు. మండల టీడీపీ అధ్యక్షులు గణపర్తి కిషక్షర్నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. టీడీపీ సీనియర్ నాయుకుడు మస్తాన్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు భారతమ్మ, జనార్దన్రెడ్డి, హరికృష్ణారెడ్డి, చిన్నారావు, అంకయ్య, వెంకటరమణయ్య, చెంచురామయ్య, సర్పంచ్ రాజేష్రెడ్డి, కస్తూరయ్య, శ్రీనివాసులు, నరేష్రెడ్డి, టీడీపీ నాయుకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
వెంకటగిరి: పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో రామకృష్ణ తెలుగు యువత ఏర్పాటు చేసిన కేక్ను మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా లోకేష్కు వేంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి గంగోటి నాగేశ్వరరావు, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి కేవీకే ప్రసాద్ నాయుడు, నాయకులు పోలంరెడ్డి కోటేశ్వరరెడ్డి, శ్రీరామదాసు గంగాధర్, పప్పు చంద్రమౌళిరెడ్డి, గెరిటి చెంచయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రాపూరు: రాపూరులో టీడీపీ మండల, పట్టణ అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర్లురెడ్డి, షేక్ ముక్తియార్ ఆధ్వర్యంలో లోకేష్ జన్మదినోత్సవాలు నిర్వహించారు. నాయకులు రమణమ్మ, పరంధామిరెడ్డి, కరీం తదితరులు పాల్గొన్నారు.