ప్రజా తిరుగుబాటుతో ఆందోళనలో వైసీపీ నేతలు: lokesh
ABN , First Publish Date - 2022-05-16T22:59:03+05:30 IST
ప్రజా తిరుగుబాటుతో ఆందోళనలో వైసీపీ నేతలు: lokesh
అమరావతి: గ్రామ గ్రామాన వైసీపీ నేతలను ప్రజలు అడ్డుకుంటున్నారని టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. జగన్ బాదుడే బాదుడు తట్టుకోలేని జనం వైసీపీ నేతలను నిలదీస్తున్నారని మండిపడ్డారు. ప్రజా తిరుగుబాటుతో ఆందోళనలో వైసీపీ నేతలు ఉన్నారని చెప్పారు. సీఎం జగన్ కూడా అధికారుల రక్షణతోనే బయటకు వస్తున్నారని లోకేష్ పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేకత ఎలా ఉందో జగన్ సర్కార్కు అర్థమవుతోందన్నారు.