సిగ్గుతో ఆ పదం ఆత్మహత్య చేసుకుంటుంది: లోకేష్
ABN , First Publish Date - 2021-11-24T22:18:02+05:30 IST
సొంత కులానికి ప్రధానమైన 1600 పదవులు కట్టబెట్టారని టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. వెనకబడిన తరగతులకు వెన్నుపోటు పొడిచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: సొంత కులానికి ప్రధానమైన 1600 పదవులు కట్టబెట్టారని టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. వెనకబడిన తరగతులకు వెన్నుపోటు పొడిచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జగన్ నువ్వు సామాజిక న్యాయం గురించి మాట్లాడకు.. సిగ్గుతో ఆ పదం ఆత్మహత్య చేసుకుంటుంది’’ అని పేర్కొన్నారు. నీ కులం కుతంత్రం, నీ మతం మారణహోమం, నీ లక్ష్యం విధ్వంసమన్నారు.