ప్రభుత్వాసుపత్రిలో పరిస్థితి హృదయ విదారకంగా మారింది: నారా లోకేష్
ABN , First Publish Date - 2021-05-07T19:17:57+05:30 IST
కాకినాడ: ప్రభుత్వ ఆస్పత్రిలో పరిస్థితి హృదయ విదారకంగా మారిందని వైసీపీపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు.
కాకినాడ: ప్రభుత్వ ఆస్పత్రిలో పరిస్థితి హృదయ విదారకంగా మారిందని వైసీపీపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. మూడు రాజధానులు తరువాత కట్టొచ్చుగానీ.. ఒకే బెడ్పైనున్న ముగ్గురికి 3 బెడ్లు కేటాయించి ప్రాణాలు కాపాడాలన్నారు. ప్రతిపక్ష నేతల్ని అక్రమ అరెస్టులు చేయించడంపై చేస్తోన్న సమీక్షలు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజల ప్రాణాలు కాపాడటంపై పెట్టాలని నారా లోకేష్ కోరారు. వ్యాక్సిన్ కొనడానికి డబ్బుల్లేవని చేతులెత్తేసి.. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాక్సిన్ తెప్పించాలంటూ సజ్జల వాగుతున్నారని నారా లోకేష్ పేర్కొన్నారు.