గిరిజన సంక్షేమమే టీడీపీ లక్ష్యం: లోకేష్
ABN , First Publish Date - 2021-08-09T21:05:01+05:30 IST
అమరావతి: గిరిజనుల సంక్షేమమే టీడీపీ లక్ష్యమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన గిరిజనులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అమరావతి: గిరిజనుల సంక్షేమమే టీడీపీ లక్ష్యమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన గిరిజనులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివాసీయుల సాంస్కృతిక జీవనం, హక్కులను పరిరక్షించాలనే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి నిర్ణయంతో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నట్లు గుర్తు చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచీ.. గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందన్నారు. ఆదివాసీయుల సంక్షేమం కోసం అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ కృషి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.