YCP నేతల సైకోయిజం ప్రజల పాలిట శాపంగా మారింది: Nara Lokesh
ABN , First Publish Date - 2022-07-02T14:40:20+05:30 IST
వైసీపీ నాయకుల(YCP Leaders) సైకోయిజం ప్రజల పాలిట శాపంగా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) పేర్కొన్నారు.
Amaravathi : వైసీపీ నాయకుల(YCP Leaders) సైకోయిజం ప్రజల పాలిట శాపంగా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) పేర్కొన్నారు. అధికార మదంతో ఏలూరులో నమస్కారం పెట్టలేదని రేషన్ వాహన డ్రైవర్పై దాడి చెయ్యడం దారుణమన్నారు. వైసీపీ కార్పొరేటర్(YCP Corporator) స్రవంతికి నమస్కారం పెట్టలేదని ఆమె భర్త నాగరాజు, వారి అనుచరులు కలిసి రేషన్ వాహన డ్రైవర్ శ్రీనివాస్పై రోకలి బండతో దాడికి పాల్పడ్డారన్నారు. శ్రీనివాస్పై అత్యంత కిరాతకంగా దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.