ఏపీలో లా అండ్ ఆర్డర్ వైసీపీ అండర్లో ఉంది: లోకేష్
ABN , First Publish Date - 2022-03-01T20:11:02+05:30 IST
జగన్రెడ్డి పాలనలో దళితులకు రక్షణ కరువైందని టీడీపీ నేత నారా లోకేష్ విమర్శించారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్రెడ్డి పాలనలో దళితులకు రక్షణ కరువైందని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా పెద్దకంటిపల్లిలో అప్పు చెల్లించలేదని దళితుడు చంద్రన్పై.. ఈశ్వర్రెడ్డి విచక్షణారహితంగా దాడి చేశాడన్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి అనుచరుడే ఈశ్వర్రెడ్డి అని లోకేష్ చెప్పారు. దళితులపై వైసీపీ శ్రేణులు దమనకాండ సాగిస్తున్నారని మండిపడ్డారు. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, ఏపీలో లా అండ్ ఆర్డర్ వైసీపీ అండర్లో ఉందన్నారు. పోలీసులు వైసీపీకి వత్తాసు పలకడం ఇకనైనా మానుకోవాలన్నారు. దళితుడిపై దాడి చేసిన ఈశ్వర్రెడ్డిపై కేసు నమోదు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.