ఏపీని లంకలా కానివ్వం: నారా లోకేష్
ABN , First Publish Date - 2022-04-10T14:15:20+05:30 IST
ఏపీని లంకలా కానివ్వకుండా అయోధ్యలా చూసుకుందాం..రామరాజ్యాన్ని తిరిగి తెచ్చుకుందామని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.
అమరావతి: ప్రజలందరికీ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఏపీని లంకలా కానివ్వకుండా అయోధ్యలా చూసుకుందాం.. రామరాజ్యాన్ని తిరిగి తెచ్చుకుందాం. పాలకుడికి అహంకారం ఉంటే రాజ్యం ఎలా దహించుకు పోతుందో చెప్పడానికి ఆనాటి లంక ఉదాహరణ. అలాగే పాలకులకి ముందుచూపు లేకపోతే ఆ రాజ్యంలో రావణ కాష్టం ఎప్పుడైనా రగులుకోవచ్చని అని చెప్పడానికి నేటి లంక ఉదాహరణ’’ అని లోకేష్ వ్యాఖ్యానించారు.