పాపాలు చేయడంలో శిశుపాలుడిని మించిపోయిన జగన్: నారా లోకేష్

ABN , First Publish Date - 2022-04-17T02:37:57+05:30 IST

తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో వారంలో 14 మంది శిశువులు చనిపోతే వైసీపీ సర్కారు నిద్ర నటిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. నారా లోకేష్ అన్నారు.

పాపాలు చేయడంలో శిశుపాలుడిని మించిపోయిన జగన్: నారా లోకేష్

తిరుపతి: తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో వారంలో 14 మంది శిశువులు చనిపోతే వైసీపీ సర్కారు నిద్ర నటిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. శనివారం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. రుయాలో పసిప్రాణాలు గాల్లో కలుస్తున్నా... గాలి మాటల సీఎం ఏం జరుగుతోందని ఆరా తీయలేదన్నారు. పాపాలు చేయడంలో శిశుపాలుడిని మించిపోయిన జగన్ నిర్లక్ష్య పాలన ఫలితమే ఈ శిశు మరణాలు అని చెప్పారు. ఆ తల్లిదండ్రుల గుండె కోతకి సమాధానం ఉందా జగన్ రెడ్డి గారూ? శిశు మరణాలు ప్రభుత్వ హత్యలే. మరణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని  నారా లోకేష్ తెలిపారు.

Updated Date - 2022-04-17T02:37:57+05:30 IST