కరోనా ఉధృతి తగ్గే వరకూ స్కూళ్లకు సెలవులు ప్రకటించాలి: లోకేష్

ABN , First Publish Date - 2022-01-26T01:45:06+05:30 IST

జగన్‌రెడ్డి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారని ..

కరోనా ఉధృతి తగ్గే వరకూ స్కూళ్లకు సెలవులు ప్రకటించాలి: లోకేష్

అమరావతి: జగన్‌రెడ్డి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచ‌ర్ల ప్రాణాలతో ప్రభుత్వం ఆటలొద్దని ఆయన సూచించారు. కరోనా సమయంలో కూడా 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి అంటూ ఆందోళనకు గురిచేయడం సరికాదన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నామంటున్న విద్యాశాఖ మంత్రి స్కూళ్లలో క‌రోనా కేసుల‌పై ఏం స‌మాధానం చెబుతారని ప్రశ్నించారు. కరోనా ఉధృతి తగ్గే వరకూ స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని లోకేష్‌ విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2022-01-26T01:45:06+05:30 IST