ఏపీలో ఉన్నది పోలీసులా?.. వైసీపీ రౌడీషీటర్లకి అనుచరులా..?: లోకేష్

ABN , First Publish Date - 2022-03-08T15:53:02+05:30 IST

ఏపీలో ఉన్నది పోలీసులా? వైసీపీ రౌడీషీటర్లకి అనుచరులా అనే అనుమానాలున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.

ఏపీలో ఉన్నది పోలీసులా?.. వైసీపీ  రౌడీషీటర్లకి అనుచరులా..?: లోకేష్

అమరావతి: ఏపీలో ఉన్నది పోలీసులా? వైసీపీ  రౌడీషీటర్లకి అనుచరులా అనే అనుమానాలున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మంగళవారం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలు, వైసీపీ అవినీతి, అక్రమాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని ఇలా చంపుకుంటూపోతే రాష్ట్రంలో వైసీపీ నేతలు - పోలీసులు మాత్రమే మిగులుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కార్యకర్త కోన వెంకటరావు మృతికి కారణమైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, బాధ్యులైన పోలీసులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వెంకటరావు కుటుంబానికి తెలుగుదేశం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సోషల్ మీడియా పోస్ట్‌ల పేరుతో టీడీపీ కార్యకర్తలపై ఇకనైనా వేధింపులు ఆపాలని కోరారు. చట్టాలని గౌరవిస్తున్నామని ...పోలీసులను అడ్డుపెట్టుకుని అరాచకాలకి తెగబడితే తిరుగుబాటు తప్పదని నారా లోకేష్ హెచ్చరించారు.


Updated Date - 2022-03-08T15:53:02+05:30 IST