ఆ కేసులు ఎత్తివేయండి.. జగన్‌కు లోకేశ్ లేఖ

ABN , First Publish Date - 2021-12-14T01:13:14+05:30 IST

సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శఇ లోకేశ్ లేఖ రాశారు. బిల్లులు చెల్లించాలని పోరాడుతున్న విజయనగరం చెరకు రైతులపై కేసులు పెట్టడం ప్రభుత్వ అహంకార ధోరణికి ..

ఆ కేసులు ఎత్తివేయండి.. జగన్‌కు లోకేశ్ లేఖ

అమరావతి: సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శఇ లోకేశ్ లేఖ రాశారు. బిల్లులు చెల్లించాలని పోరాడుతున్న విజయనగరం చెరకు రైతులపై కేసులు పెట్టడం ప్రభుత్వ అహంకార ధోరణికి నిదర్శనమని ఆయన లేఖలో పేర్కొన్నారు. రైతులకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అని ప్రశ్నించారు. ‘‘ప్రభుత్వ వైఫల్యాలతో వ్యవసాయరంగం సంక్షోభంలో పడింది. ధాన్యం బకాయిలు, పంట నష్ట పరిహారం రాకపోవడంతో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ రంగం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఎన్‌సీఎస్‌ చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు రూ.17 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. బిల్లులు చెల్లించని యాజమాన్యంపై చర్యలు తీసుకోకుండా చెరకు రైతులపై కేసులు పెట్టడం అన్యాయం. వెంటనే రైతులపై పెట్టిన కేసులను ఎత్తేసి బకాయిలు చెల్లించాలి.’’ అని లోకేశ్ లేఖలో కోరారు. 

Updated Date - 2021-12-14T01:13:14+05:30 IST