AP News: వరద ప్రాంతాల్లో జగన్ పర్యటన బూటకం: లోకేశ్
ABN , First Publish Date - 2022-07-28T02:17:29+05:30 IST
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన బూటకమేనని టీడీపీ నేత నారా లోకేశ్ (Nara Lokesh) విమర్శించారు.
మంగళగిరి: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన బూటకమేనని టీడీపీ నేత నారా లోకేశ్ (Nara Lokesh) విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరి (Mangalagiri)లో లోకేశ్ పర్యటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ హయాంలో వేసిన రోడ్లపైనే వరద ప్రాంతాల్లో జగన్ (Jagan) తిరిగారని గుర్తుచేశారు. వెనుక కార్లు వస్తున్నా ముందు ట్రాక్టరుపై వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. విలీన ప్రాంతాల ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో అర్థమవుతుందన్నారు. జగన్ దోపిడీని దశల వారీగా బయటపెడతామని లోకేశ్ ప్రకటించారు.