ముగ్గురు నానిలకు టీడీపీని విమర్శించడమే పని: లోకేష్
ABN , First Publish Date - 2021-03-08T20:01:12+05:30 IST
ముగ్గురు నానిలకు టీడీపీని విమర్శించడమే పని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు.
మచిలీపట్నం: ముగ్గురు నానిలకు టీడీపీని విమర్శించడమే పని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. సోమవారం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పేర్ని నాని బందరులో ఏమి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. సీఎం జగన్రెడ్డి అన్ని పెంచుతూ పోయారు తప్ప ప్రజలకు ఏమి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ రూ. 100, గ్యాస్ రూ.1000 చేశారని ధ్వజమెత్తారు. టీడీపీ అభ్యర్థులను గెలిపించండి... తాము ఇచ్చిన పది వాగ్దానాలను అమలుచేసి తీరుతామని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకుని ...టీడీపీనే గెలిపించాలని లోకేష్ తెలిపారు.