ప్రజలకు అండగా ఉండాలని ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేశాం: లోకేష్
ABN , First Publish Date - 2022-02-16T00:10:35+05:30 IST
ప్రజలకు అండగా ఉండాలని ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేశాం: లోకేష్
విజయవాడ: ప్రజలకు అండగా ఉండాలని ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేశామని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. 25 ఏళ్లగా ప్రజలకు ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలందిస్తోందని తెలిపారు. విద్యా, వైద్యం, ఉపాధి రంగాల్లో ట్రస్ట్ సేవలు కొనసాగుతున్నాయన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలతో లక్షలాది మంది లబ్ధిపొందారని చెప్పారు. అలాగే ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండగా నిలిచిందన్నారు. దాతలందరికీ ట్రస్ట్ సిల్వర్జూబ్లీ వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.