విజయానికి ట్రేడ్ మార్క్ ఇస్రో: లోకేశ్

ABN , First Publish Date - 2021-02-28T17:30:22+05:30 IST

ఇస్రో శాస్త్రవేత్తలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభినందించారు.

విజయానికి ట్రేడ్ మార్క్ ఇస్రో: లోకేశ్

ఇంటర్నెట్ డెస్క్: ఇస్రో శాస్త్రవేత్తలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభినందించారు. నింగిని శాసించే స్థాయికి ఎదుగుతున్న మన శ్రీహరికోట అంతరిక్ష కేంద్ర శాస్త్రవేత్తలు అంటూ ట్వీట్ చేశారు. పీఎస్ఎల్వీ సీ51 రాకెట్ ప్రయోగం విజయవంతం అవ్వడం, విజయానికి ఇస్రో ట్రేడ్ మార్క్‌లా మారడం దేశానికే గర్వకారణమన్నారు. 


పీఎస్‌ఎల్వీ-సీ51 రాకెట్ ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. ఆదివారం నింగిలోకి దూసుకు వెళ్లిన రాకెట్.. నిర్దేశిత కక్ష్యలో ఉపగ్రహాలను వదిలిపెట్టింది. ఇస్రో తొలిసారి చేపట్టిన  ప్రైవేట్ వాణిజ్య ప్రయోగంగా ఇది రికార్డులకెక్కింది. మొత్తం  19 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టారు.

Updated Date - 2021-02-28T17:30:22+05:30 IST