Jagan పేర్ల మార్పు పిచ్చి పరాకాష్టకు చేరింది: లోకేష్‌ ట్వీట్‌

ABN , First Publish Date - 2022-10-07T18:21:13+05:30 IST

ఏపీ సీఎం జగన్‌ పేర్ల మార్పు పిచ్చి పరాకాష్టకు చేరిందని.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ట్విటర్ వేదికగా విమర్శించారు.

Jagan పేర్ల మార్పు పిచ్చి పరాకాష్టకు చేరింది: లోకేష్‌ ట్వీట్‌

Amaravathi : ఏపీ సీఎం జగన్‌ (AP CM Jagan) పేర్ల మార్పు పిచ్చి పరాకాష్టకు చేరిందని.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ (Nara Lokesh) ట్విటర్ (Twitter) వేదికగా విమర్శించారు. మహనీయులను అవమానించడమే జగన్ పనిగా మారిందన్నారు. విజయనగరం మహారాజా ప్రభుత్వాసుపత్రి (Maharaja Government Hospital) పేరు మార్చి.. ప్రజల మనోభావాలను దెబ్బతీశారన్నారు. విలువైన భూమిని ఆస్పత్రి కోసం మహారాజా కుటుంబం ఇచ్చేసిందని నారా లోకేష్ పేర్కొన్నారు. కేంద్రమంత్రిగా నిధులు కేటాయించి ఆస్పత్రిని అశోక్‌ గజపతిరాజు (Ashok Gajapathi Raju) అభివృద్ధి చేశారు. రాత్రికి రాత్రి మహారాజా పేరుని తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని లోకేష్‌ ట్వీట్‌‌లో పేర్కొన్నారు. 

Updated Date - 2022-10-07T18:21:13+05:30 IST