నరసరావుపేట టీడీపీ ఇన్చార్జ్ అరవింద్ బాబు విడుదల
ABN , First Publish Date - 2021-08-28T19:16:31+05:30 IST
నరసరావుపేట టీడీపీ ఇన్చార్జ్ అరవింద్ బాబు పోలీస్ స్టేషన్ నుంచి విడుదల్యారు.
గుంటూరు: నరసరావుపేట టీడీపీ ఇన్చార్జ్ అరవింద్ బాబు పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యారు. స్టేషన్లో మంచి నీళ్లు కూడా ముట్టకుండా అరవింద్ బాబు నిరసన వ్యక్తం చేశారు. అరవింద్ బాబుతో పాటు పాలపాడు టీడీపీ కార్యకర్తలను పోలీసులు వదిలేశారు. అందరికీ 41 నోటీసులు ఇచ్చి పంపించేశారు. స్టేషన్ నుంచి విడుదలైన అరవింద్ బాబు ర్యాలీగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
కాగా...ఈరోజు ఉదయం అరవింద్బాబు పోలీసులు అరెస్ట్ చేశారు. పాలపాడుకు చెందిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రంతా టీడీపీ కార్యకర్తలను పోలీసులు పీఎస్లోనే ఉంచారు. టీడీపీ కార్యకర్తలను విడిచి పెట్టాలని అరవింద్బాబు స్టేషన్కు వెళ్లారు. పోలీసులు స్పందించకపోవడంతో స్టేషన్ ఎదుట భైఠాయించారు. బలవంతంగా అరవింద్బాబును అరెస్టు చేసి పోలీసులు స్టేషన్లోకి తీసుకెళ్లారు. పోలీసుల తీరుపై స్టేషన్లోఅరవింద్బాబు నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలను విడిచిపెట్టే వరకు మంచి నీళ్లు కూడా ముట్టనని అరవింద్బాబు పేర్కొన్నారు. స్టేషన్ దగ్గరకు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు.