కమనీయం నృసింహుడి కల్యాణం

ABN , First Publish Date - 2022-05-16T03:56:08+05:30 IST

మండలంలోని లక్ష్మీనరసింహపురంలో ఆదివారం నిర్వహించిన శ్రీదేవి, భూదేవి సమేత నృసింహుడి కల్యాణం కమనీయంగా సాగింది.

కమనీయం నృసింహుడి కల్యాణం
ఎల్‌ఎన్‌ పురంలో నృసింహుని కల్యాణం నిర్వహిస్తున్న వేదపండితులు

 మనుబోలు, మే 15: మండలంలోని లక్ష్మీనరసింహపురంలో ఆదివారం నిర్వహించిన శ్రీదేవి, భూదేవి సమేత నృసింహుడి కల్యాణం కమనీయంగా సాగింది. గ్రామంలో జరుగుతున్న స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి, లక్ష్మీనరసింహ ఉత్సవమూర్తులను కల్యాణ అలంకరణలో అలంకరించి కల్యాణ యాజ్ఞికులు శ్రీనివాసాచార్యులు, కేశవాచార్యులు వేదమంత్రాలు వల్లిస్తూ శాస్త్రోపేతంగా నిర్వహించారు. గ్రామంలో 15 ఏళ్ల తరువాత నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు కావడంతో కల్యాణం తిలకించేందుకు ఊరూరూ కదిలివచ్చింది. మంగళవాయిద్యాలు, విద్యుద్దీపకాంతులు, అశేషభక్త జనం నడుమ సాయంకాలం పూట స్వామివారి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. అనంతరం భక్త జనానాకి బ్రహ్మోత్సవాల నిర్వాహకులు అన్నప్రసాద వితరణ చేశారు. మహిళలకు చీర, జాకెట్లు పంపిణీ చేశారు. 

Updated Date - 2022-05-16T03:56:08+05:30 IST