తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలి: నారాయణ

ABN , First Publish Date - 2021-07-28T21:54:37+05:30 IST

తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు పథకం అమలు చేయాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు.

తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలి: నారాయణ

తిరుపతి: తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు పథకం అమలు చేయాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు తీసుకువచ్చినట్లయితే.. ఓట్లు కొనుగోలుకు చేసే ప్రయత్నంగానే భావిస్తామన్నారు. ఏపీలోనూ దళిత బంధు పథకం అమలు చేయాలని ఆయన సీఎం జగన్‌కు సూచించారు.


దళిత బంధు పేరుతో పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో దళిత కుటుంబానికి సీఎం కేసీఆర్ రూ. 10 లక్షలు ఇస్తున్నారని.. దాన్ని స్వాగతిస్తున్నామని నారాయణ అన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు ఇవ్వాలన్నారు. ఈ పథకం హుజూరాబాద్ వరకే పరిమితం చేస్తే.. ప్రజలను మోసం చేయడమేనని నారాయణ అన్నారు. 

Updated Date - 2021-07-28T21:54:37+05:30 IST