Tirupathi.. విడుదల రజినీ, మేయర్ శీరీషా మహిళా ద్రోహులు: నారాయణ

ABN , First Publish Date - 2022-08-16T19:35:53+05:30 IST

మంత్రి విడదల రజినీ, మేయర్ శిరీషా మహిళా ద్రోహులని సీపీఐ నేత నారాయణ విమర్శించారు.

Tirupathi.. విడుదల రజినీ, మేయర్ శీరీషా మహిళా ద్రోహులు: నారాయణ

తిరుపతి (Tirupathi): వైద్యశాఖ మంత్రి విడదల రజినీ (Vidadala Rajini), తిరుపతి మేయర్ శిరీషా (Shirisha)లు మహిళా ద్రోహులని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana) విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కేసులకు భయపడేది లేదని, ఇక్కడ నుంచి ప్రసూతి వైద్యశాలను (Maternity hospital) తరలిస్తే ఊరుకునేది లేదన్నారు. ఎంత వరకైనా పోరాడతామని స్పష్టం చేశారు. ప్రసూతి ఆస్పత్రి భవనానికి తగిలించిన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం బోర్డును సీపీఐ కార్యకర్తలు పీకి, కాల్చేశారు. ఆస్పత్రిలో పేషెంట్లు ఉన్నా బోర్డు మార్చడంపై మండిపడ్డారు. దీంతో ప్రసూతి వైద్యశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Updated Date - 2022-08-16T19:35:53+05:30 IST