AP రాజధాని Hyderabadగానే YCP నేతలు వ్యవహరిస్తున్నారు: Narayana

ABN , First Publish Date - 2022-07-18T17:55:59+05:30 IST

ఏపీ రాజధాని హైదరాబాద్ గానే వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని సీపీఐ నేత నారాయణ అన్నారు.

AP రాజధాని Hyderabadగానే YCP నేతలు వ్యవహరిస్తున్నారు: Narayana

తిరుపతి (Tirupathi): ఏపీ (AP) రాజధాని హైదరాబాద్ (Hyderabad)గానే వైసీపీ (YCP) నేతలు వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana) అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం ఏమి చేసిందని వైసీపీ, టీడీపీ (TDP)లు..రాష్టప్రతి ఎన్నికల్లో ఎన్డీయే (NDA) అభ్యర్థికి మద్దతు తెలిపారని ప్రశ్నించారు. బ్లాక్ మెయిల్ (Blackmail) చేసి పార్టీలను బీజేపీ లొంగదీసుకుంటోందని, తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress)ను తిప్పలు పెట్టిన వ్యక్తిని ఉపరాష్ట్రపతిని చేస్తున్నారని విమర్శించారు. గంగమ్మను అలంకరించి ఊరి బయట వదిలేస్తారు.. వెంకయ్య (Venkaiah) పరిస్థితి అదేనని అన్నారు. స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న వెంకయ్య నోరు నొక్కే పని చేశారని ఆరోపించారు. జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ (Pawan Kalyan) ఓ ల్యాండ్ మైన్ అని.. ఎక్కడ దేనికి పెలుతుందో తెలియని పరిస్థితి అని అన్నారు. వరద వెనుక విదేశీ కుట్ర అనటం ద్వారా సీఎం కేసీఆర్ కేంద్రం విషయంలో వెనక్కు తగ్గినట్టు కనిపిస్తోందన్నారు. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ వేదికపైకి అల్లూరి సీతారామరాజుగా నటించిన కృష్ణను, కాకుండా చిరంజీవిని ఎక్కించటం సరికాదని నారాయణ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-07-18T17:55:59+05:30 IST