వివేకా హత్య కేసులో ప్రధాన సూత్రధారి శివశంకర్‌రెడ్డి : సీబీఐ

ABN , First Publish Date - 2021-12-23T15:22:19+05:30 IST

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డే ప్రధాన సూత్రధారిగా సీబీఐ అధికారులు తేల్చారు.

వివేకా హత్య కేసులో ప్రధాన సూత్రధారి శివశంకర్‌రెడ్డి : సీబీఐ

కడప : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డే ప్రధాన సూత్రధారిగా సీబీఐ అధికారులు తేల్చారు. శివశంకర్ రెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షల నిర్వహణపై రేపు పులివెందుల కోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. న్యాయస్థానం ముందు ఇప్పటికే సీబీఐ దర్యాప్తు వివరాలను ఉంచింది. పదిరోజుల ముందే న్యాయస్థానానికి సీబీఐ వివరించింది. వివేకా గుండెపోటు, రక్తపు వాంతులతో చనిపోయాడని శివశంకర్ రెడ్డి చెప్పించినట్లు న్యాయస్థానానికి తెలిపింది. సీఐని కూడా మోటివేట్ చేశాడని వెల్లడించింది. సీబీఐ వివరాలను పరిగణలోకి తీసుకొని గత రెండు రోజుల క్రితం శివశంకర్ రెడ్డికి న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. శంకర్ రెడ్డికి బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తాడని సీబీఐ న్యాయస్థానానికి తెలిపింది. శివశంకరరెడ్డిని నార్కో అనాలసిస్‌కు అనుమతివ్వాలని మూడు రోజుల క్రితం కోర్టులో పిటిషన్ వేసింది. 

Updated Date - 2021-12-23T15:22:19+05:30 IST