ycp పాలనలో తీవ్ర సంక్షోభంలో రైతాంగం: ధూళిపాళ్ల

ABN , First Publish Date - 2022-05-27T21:18:28+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ పాలనపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర నిప్పులు చెరిగారు. వైసీపీ పాలనలో రాష్ట్ర రైతాంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయిందని చెప్పారు.

ycp పాలనలో  తీవ్ర సంక్షోభంలో  రైతాంగం: ధూళిపాళ్ల

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ పాలనపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర నిప్పులు చెరిగారు. వైసీపీ పాలనలో రాష్ట్ర రైతాంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయిందని చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 45 లక్షల ఎకరాల పంటల సాగు ఉంటే.. వైసీపీ ప్రభుత్వం  కేవలం 15 లక్షల ఎకరాలకే ఇన్స్యూరెన్స్ ఇచ్చిందన్నారు. పెట్రో ధరల భారం కారణంగా రైతుల పైనా తీవ్ర భారం పడుతుందన్నారు. మోటార్లకు మీటర్లు పెడితే రైతులకు లాభమని మంత్రులు వింత వాదన చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ రైతులకు మీటర్ల పెట్టబోమని స్పష్టంగా చెపితే.. జగన్ మీటర్లు పెట్టి ఉరితాళ్లు వేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో రైతులకు ఉన్న పథకాలు అన్నీ ఆగిపోయాయని చెప్పారు.

రాయల సీమలో ఉండే డ్రిప్ ఇరిగేషన్ పూర్తిగా ఆపేశారన్నారు. ఒక్క రూపాయి రైతులకు డ్రిప్ సబ్సిడీ కింద ఇవ్వలేదన్నారు..ప్రభుత్వం చెప్పిన రూ. 3 వేల కోట్ల ధరల స్థిరీకరణ ఏమయ్యింది..? అని ప్రశ్నించారు. ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఉంటే రూ. 1000- రూ.1100కు ధాన్యం ఎందుకు అమ్ముకుంటారు..? అని నిలదీశారు. స్వయంగా వైసీపీ ఎంపీనే ధాన్యం రైతులకు జరుగుతున్న అన్యాయంపై చెప్పింది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. రైతుకు టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసిన దానికంటే ఒక్క రూపాయి కూడా అదనంగా వైసీపీ ఖర్చు చేయలేదని ధూళిపాళ్ల నరేంద్ర చెప్పారు.

Updated Date - 2022-05-27T21:18:28+05:30 IST