విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేలా జీవో 117: నర్సింహారెడ్డి

ABN , First Publish Date - 2022-06-16T17:55:42+05:30 IST

విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేందుకే జీవో నంబర్ 117ని సీఎం జగన్ తీసుకోచ్చారని ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి అన్నారు.

విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేలా జీవో 117: నర్సింహారెడ్డి

కడప: విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేందుకే జీవో నంబర్ 117ని సీఎం జగన్ తీసుకోచ్చారని ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి అన్నారు. గురువారం నగరంలోని డీఈఓ కార్యాలయం ఎదుట ప్యాక్టో ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాడు నేడుతో పాఠశాలలకు మేలు కన్నా నష్టమే ఎక్కువగా ఉందన్నారు.ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఎమ్మెల్సీలతో ప్రభుత్వం చర్చించి జీవో నంబర్ 117పై తగిన నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-06-16T17:55:42+05:30 IST