తెలంగాణ ప్రభుత్వంపై ఎన్జీటీ ఆగ్రహం
ABN , First Publish Date - 2021-11-26T02:21:21+05:30 IST
తెలంగాణ ప్రభుత్వంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సచివాలయం కూల్చివేతకు, కొత్తగా నిర్మాణాలు చేపట్టానికి పర్యావరణ అనుమతులు తీసుకున్నారో ...
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సచివాలయం కూల్చివేతకు, కొత్తగా నిర్మాణాలు చేపట్టానికి పర్యావరణ అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలని ఆదేశించింది. సచివాలయం కూల్చివేత, కట్టడాలకు పర్యావరణ అనుమతులు లేవంటూ ఎన్జీటీలో రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుండా జాప్యం చేసింది. దీంతో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది.