అంతటా జాతీయ గీతాలాపన
ABN , First Publish Date - 2022-08-17T06:33:52+05:30 IST
జాతీయ భావం ఉప్పొంగింది. 75 స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా మంగళవారం ఉదయం 11:30 గంటలకు జిల్లావ్యాప్తంగా జాతీయ గీతాలాపన కోసం ఎక్కిడి వారు అక్కడే ఉండి జాతీయ గీతాపాలన చేశారు.
జాతీయ భావం ఉప్పొంగింది. 75 స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా మంగళవారం ఉదయం 11:30 గంటలకు జిల్లావ్యాప్తంగా జాతీయ గీతాలాపన కోసం ఎక్కిడి వారు అక్కడే ఉండి జాతీయ గీతాపాలన చేశారు. మునిసిపాలిటీలు, గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద, పాఠశాలల్లో దుకాణాల్లో వాహనాల్లో ఉన్న వారు ఎక్కడిక్కడ జాతీయ గీతాలాపన చేశారు. గ్రామ కూడళ్లలో ఏర్పాటు చేసిన మైక్ సెట్ల ద్వారా జాతీయ గీతాన్ని వినిపించగా స్థానికులు జెండాలను చేబూని వందనం చేస్తూ జాతీయ గీతాలాపాన చేశారు. గీతాలాపన పూర్తయ్యాక భారత్ మాతాకీ జై.. వందేమాతరం.. అంటూ నినదించారు. వ్యవసాయ కూలీపనులకు వెళ్లే వారు జాతీయ గీతాలాపన సమయం కావడంతో దేశభక్తితో జాతీయ జెండాను చేబూని వందనం చేస్తూ గీతాలాపన చేశారు.
(ఆంధ్రజ్యోతి న్యూస్నెట్వర్క్)