దేశాభివృద్ధి రాహుల్‌గాంధీతోనే సాధ్యం

ABN , First Publish Date - 2021-06-20T05:45:32+05:30 IST

దేశాభివృద్ధి, సుస్థిరపాలన ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతోనే సాధ్యమని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు. రాహుల్‌గాంధీ జన్మదినం సందర్భంగా జిల్లాలో పలుచోట్ల శనివారం వేడుకలను నిర్వహించారు.

దేశాభివృద్ధి రాహుల్‌గాంధీతోనే సాధ్యం
సూర్యాపేట ఆస్పత్రిలో పండ్లు పంపిణీ చేస్తున్న కౌన్సిలర్లు

సూర్యాపేట, జూన్‌ 19 : దేశాభివృద్ధి, సుస్థిరపాలన ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతోనే సాధ్యమని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు. రాహుల్‌గాంధీ జన్మదినం సందర్భంగా జిల్లాలో పలుచోట్ల శనివారం వేడుకలను నిర్వహించారు. సూర్యాపేటలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌ రమే్‌షరెడ్డి సూచనల మేరకు కౌన్సిలర్‌ షఫిఉల్లా, డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ ముదిరెడ్డి రమణారెడ్డి పండ్లు పంపిణీ చేశారు. నేరేడుచర్లలో కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంచి పెట్టారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నూకల సందీ్‌పరెడ్డి, రణపంగు నాగయ్య, ఖాదర్‌, పాండు నాయక్‌, ముస్తఫా, పాల్వాయి కృష్ణమూర్తి పాల్గొన్నారు. హుజూర్‌నగర్‌ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తన్నీరు మల్లిఖారున్‌రావు, సాముల శివారెడ్డి, అజీజ్‌పాషా, శివరామయాదవ్‌, శ్రవణ్‌కుమార్‌ పాల్గొన్నారు. నాగారం మండలం ఫణిగిరి అనాథశ్రమంలో కాంగ్రెస్‌ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు తోడ్సు లింగయ్య, యల్మకంటి సోమన్న, నాతి వీరమల్లు, సోమయ్య, భాను పాల్గొన్నారు. మేళ్లచెర్వులో పీహెచ్‌సీలో రోగులకు పండ్లు, బెడ్‌ ప్యాకెట్ల పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు కొట్టె సైదేశ్వర్‌రావు, గోవింధరెడ్డి, శెట్టా రామచంద్ర పాల్గొన్నారు. కోదాడలో రాజీవ్‌చౌరస్తాలో అన్నదానం నిర్వహించారు. పీసీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, వంగవీటి రామారావు, పారా సీతయ్య, ధనమూర్తి, చింతలపాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. నూతన్‌కల్‌లో పాస్టర్లకు, జర్నలిస్టులకు రాష్ట్ర ఎస్సీసెల్‌ అధ్యక్షుడు నాగరిగారి ప్రీతం ఆధ్వ ర్యంలో యువజన కాంగ్రెస్‌ పార్టీ నియోజక వర్గ అధ్య క్షుడు వేల్పుల రమేష్‌, ఎస్సీసెల్‌ అధ్యక్షుడు ఈదుల రమేష్‌ చంద్ర ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్సీసెల్‌ మండల అధ్యక్షుడు కొమ్ము శ్రీను, పరమేష్‌ ఉన్నారు. మద్దిరా లలో నాయకులు మార్త కృష్ణమూర్తి, వెంకన్న, ఉపేందర్‌, నలమాస ఉపేందర్‌ పాల్గొన్నారు. ఆత్మకూర్‌ (ఎస్‌) మండలకేంద్రంలోని పీహెచ్‌సీలోని  రోగులకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పండ్లు, బ్రెడ్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కందాల వెంకట్‌రెడ్డి, పాండునాయక్‌, రాజు, ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు.  

Updated Date - 2021-06-20T05:45:32+05:30 IST