3న జిన్నా టవర్ ఆవరణలో జాతీయ జెండా అవిష్కరణ: మేయర్
ABN , First Publish Date - 2022-02-02T02:21:40+05:30 IST
చరిత్రాత్మకమైన జిన్నా టవర్ ఆవరణలో ఈనెల 3న జాతీయ జెండా అవిష్కరిస్తున్నామని
గుంటూరు: చరిత్రాత్మకమైన జిన్నా టవర్ ఆవరణలో ఈనెల 3న జాతీయ జెండా అవిష్కరిస్తున్నామని మేయర్ కావటి మనోహర్ నాయుడు తెలిపారు. గత కొద్దిరోజులుగా జిన్నా టవర్ పేరు మార్చాలని బీజేపీ నేతలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారన్నారు. బీజేపీ నేతలు చేపట్టిన కార్యక్రమానికి స్వస్తి చెప్పాలని ముస్లిం పెద్దలతో కలసి ఓ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. జాతీయ జెండా అవిష్కరణతో జిన్నా టవర్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. జిన్నా టవర్ పేరు మార్చే ప్రసక్తే లేదని తమ అధిష్టానం తీర్మానం చేసిందన్నారు. ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చి విభేదించినా జిన్నా టవర్గానే కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.