జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య పరీక్షలు

ABN , First Publish Date - 2021-01-24T22:38:42+05:30 IST

జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా స్వచ్ఛంద సంస్థ ‘వారధి’ ఆధ్వర్యంలో మెహదీపట్నంలోని రాధా కిషన్ అనాథ బాలికా గృహంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు.

జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య పరీక్షలు

హైదరాబాద్: జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా స్వచ్ఛంద సంస్థ ‘వారధి’ ఆధ్వర్యంలో మెహదీపట్నంలోని రాధా కిషన్ అనాథ బాలికా గృహంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారధి సంస్థ అధ్యక్షులు శ్రీధర్ కమ్మదానం, బంజారా మహిళా ఎన్జీవో చైర్మన్ డాక్టర్ ఆనంద్, డాక్టర్ రాజ్, డాక్టర్ సరళ, డాక్టర్ కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆడ పిల్లలందరికీ ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించి, సానిటరీ ప్యాడ్స్, కాల్షియం సంబంధిత మందులను అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆనంద్ మట్లాడుతూ.. బాలిక రక్షణ వారి స్వాస్థ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఈ కార్యక్రమానికి సహాయాన్ని అందించిన వారధి సంస్థకు ధన్యవాదాలు తెలియజేశారు.  



Updated Date - 2021-01-24T22:38:42+05:30 IST