11న జాతీయ లోక్‌ అదాలత్‌

ABN , First Publish Date - 2021-12-05T06:21:38+05:30 IST

ఈ నెల 11న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.వీఆర్‌కే కృపాసాగర్‌ కోరారు.

11న జాతీయ లోక్‌ అదాలత్‌

కర్నూలు(లీగల్‌), డిసెంబరు 4: ఈ నెల 11న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.వీఆర్‌కే కృపాసాగర్‌ కోరారు. జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌ అదాలత్‌లో రాజీకి వీలున్న క్రిమినల్‌ కేసులు, సివిల్‌, వాహన ప్రమాద కేసులు, బ్యాంకు కేసులు, ప్రిలిటిగేషన్‌ కేసులను కూడా పరిష్కరించుకోవచ్చన్నారు. వీటిపై ఆయన న్యాయమూర్తులు, న్యాయవాదులతో  వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీహెచ్‌ వెంకట నాగశ్రీనివాసరావు, న్యాయమూర్తులు వి.సత్యలక్ష్మీప్రసన్న, డి.షర్మిల, కె.భార్గవి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు మాసిపోగు సుబ్బయ్య, అబ్దుల్‌ కరీమ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-05T06:21:38+05:30 IST