26న జాతీయ లోక్ అదాలత్
ABN , First Publish Date - 2022-06-24T05:30:00+05:30 IST
ఈ నెల 26న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి వెల్లడించారు.
సంగారెడ్డి క్రైం, జూన్ 24: ఈ నెల 26న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి వెల్లడించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో క్రిమినల్ కాంపౌండేబుల్, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన కేసులు, బ్యాంకు రికవరీ కేసులు, చెక్బౌన్స్ కేసులు, కుటుంబ తగాదాలు, టెలిఫోన్ రికవరీ కేసులు, మోటార్ వాహన ప్రమాద నష్ట పరిహారం కేసులు, ప్రీలిటిగేషన్ కేసులు, రాజీ మార్గాన సత్వర న్యాయం అందించే వీలున్న కేసులను పరిష్కరించనున్నట్టు వివరించారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని శశిధర్రెడ్డి కోరారు.