దారుణం... బయటపడ్డ ఏడు పిండాలు

ABN , First Publish Date - 2022-06-25T14:57:22+05:30 IST

దారుణం... బయటపడ్డ ఏడు పిండాలు

దారుణం... బయటపడ్డ ఏడు పిండాలు

బెంగళూరు: కర్ణాటకలోని బెలగావి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముదలగి పట్టణ శివార్లలోని ఓ బస్టాప్‌లో గుర్తు తెలియని వ్యక్తులు డబ్బాను వదిలి వెళ్లారు. గుర్తించిన స్థానికులు తెరచి చూడగ అందులో ఏడు పిండాల అవశేషాలు బయటపడ్డాయి. ఈ విషయంలపై స్థానికులు పోలీసులకు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. వాటిని భ్రూణహత్యలుగా నిర్ధారించారు. లింగ నిర్ధారణ చేసిన తర్వాత గర్భస్రావం చేశారని, అవి ఐదు నెలల నిండిన శిశువుల పిండాలని గుర్తించారు.  


ఆ పిండాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా వైద్యాధికారి డా.మహేష్ కోని ఈ ఘటనపై స్పందిస్తూ.. మొదట పిండాల లింగ నిర్ధారణ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఈ పిండాలను బెల్గావి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీకి పంపిస్తామన్నారు. దీనిపై కొంతమంది అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపిస్తామన్నారు.

Updated Date - 2022-06-25T14:57:22+05:30 IST