జాతీయ పార్టీలు ఓట్ల రాజకీయాలు మానాలి: గుత్తా

ABN , First Publish Date - 2022-04-16T00:02:14+05:30 IST

దేశంలోని జాతీయ పార్టీలు ఓట్ల రాజకీయాలు మానుకుని ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడితే మంచిదని శాసనమండలి

జాతీయ పార్టీలు ఓట్ల రాజకీయాలు మానాలి: గుత్తా

నల్లగొండ: దేశంలోని జాతీయ పార్టీలు ఓట్ల రాజకీయాలు మానుకుని ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడితే మంచిదని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు బాంధవుడైన సీఎం కేసీఆర్‌ రైతుల నుంచి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తున్నారన్నారు. ఛత్తీస్‌ఘడ్‌, బీహార్‌, ఏపీ రాష్ట్రాల నుంచి తెలంగాణకు ధాన్యం లోడు వాహనాలు వస్తున్నాయని, ఇక్కడే ఆయా రాష్ట్రాల ధాన్యాన్ని విక్రయించుకునే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల ధాన్యం రాకుండా రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేయడంతో తెలంగాణ రైతాంగానికి న్యాయం జరుగుతుందన్నారు. తామే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తున్నామని బీజేపీ అనడం సిగ్గుచేటని సుఖేందర్‌రెడ్డి అన్నారు.

Updated Date - 2022-04-16T00:02:14+05:30 IST