ఆసుపత్రిని సందర్శించిన జాతీయ నాణ్యత బృందం
ABN , First Publish Date - 2022-05-11T07:21:58+05:30 IST
జిల్లా కేంద్ర ఆసుపత్రిని మంగళవారం జాతీయ నాణ్యత అంచనాల బృందం సందర్శించింది.
నిర్మల్ కల్చరల్, మే 10 : జిల్లా కేంద్ర ఆసుపత్రిని మంగళవారం జాతీయ నాణ్యత అంచనాల బృందం సందర్శించింది. ఆసుపత్రిలో రోగు లకు అందుతున్న సేవలు, సౌకర్యాలు, ఆసుపత్రి నిర్వహణ తదితర అంశా లను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రోగులను కలుసుకున్నారు. వీరి నివేదికల ఆధారంగా మరింత మెరుగైన వైద్యం రోగులకు అందించే అవ కాశాలున్నాయని బృందం తెలిపింది. డాక్టర్ సరోజ బాల, జ్యోష్న అగ్రవాల్, ప్రశాంత్ సత్యదేవ్ ఈ బృందంలో ఉన్నారు. ఏరియా ఆసుపత్రి సూపరెం టెండెంట్ దేవేందర్రెడ్డి, వేణుగోపాలకృష్ణ, ప్రమోద్ చంద్రారెడ్డి, తది తరులు పాల్గొన్నారు.